టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్రామ్ (Kalyan Ram) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది బింబిసార (Bimbisara). వశిష్ఠ (Vasishta) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను ప్రాంఛైజీగా తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు కల్యాణ్ రామ్. ఇక ఫస్ట్ పార్టును తెరకెక్కించిన వశిష్ఠనే సీక్వెల్ బింబిసార 2 (Bimbisara 2)ను కూడా డైరెక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా డైరెక్టర్ వశిష్ఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని టాక్ నడుస్తోంది. వశిష్ఠ, కల్యాణ్ రామ్ ఇద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోండగా.. దీనిపై చిత్ర యూనిట్ ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కల్యాణ్రామ్ బింబిసార చిత్రానికి వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేసిన అనిల్ పాడూరితో సీక్వెల్కు పనిచేయాలని ఫిక్స్ అయ్యాడని, అన్నీ కుదిరితే అనిల్ పాడూరి బింబిసార 2కు డైరెక్టర్గా పనిచేయడం పక్కా అని ఇన్సైడ్ టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
వశిష్ఠ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, రాంచరణ్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నాడట. అంతేకాదు వశిష్ఠ చెప్పిన ఓ స్టోరీ లైన్ రజినీకాంత్కు బాగా నచ్చిందట. టాలీవుడ్లో సీక్వెల్ సినిమాలకు దర్శకులు మారడం కొత్తేమీ కాదు. డీజే టిల్లు సీక్వెల్ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తాడని ముందుగా అంతా అనుకున్నారు.. కానీ సీక్వెల్ టిల్లు 2కు ఆయన స్థానంలో మల్లిక్ రామ్ డైరెక్టర్గా రీప్లేస్ అయ్యాడు. వశిష్ఠ అప్డేట్ నిజమే అయితే డైరెక్టర్ మారిన సీక్వెల్ సినిమాల జాబితాలో బింబిసార 2కూడా చేరిపోనుంది.
మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్గా తెరకెక్కిన బింబిసారలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు.