Kalki 2898 AD | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. మే 09 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం నాగ్ అశ్విన్ టీం గ్రాండ్ ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేసుకుంది.
ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న రైడర్స్ను బాంబేలోని ఓ ఈవెంట్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ ప్రమోషన్స్కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ రైడర్స్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇంటిముందు (మన్నత్) నిలుచున్నారు. కల్కి చిత్రబృందం తాజాగా విడుదల చేసిన రిలీజ్ పోస్టర్ను పట్టుకుని మన్నత్ (Mannat) ముందు రైడర్స్ నిలుచున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి.
Was just passing by #Mannat and look what I spotted – #Kalki. pic.twitter.com/NLoPduOwpa
— Himesh (@HimeshMankad) January 12, 2024
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై సీ అశ్వనీదత్ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు.