తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు. 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 75 ఏండ్లు ఆయన ఉన్నారు. ప్రపంచంలో అంత అనుభవం ఉన్న నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చనిపోయే వరకు కూడా నటిస్తూనే ఉన్నారు.. ఆయన మరణం అప్పట్లో ఒక సంచలనం. అన్ని సంవత్సరాల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపించే వారు నాగేశ్వరరావు. కచ్చితంగా వందేండ్లు బతుకుతాడని చాలామంది లెక్కలు వేసుకున్నారు. కానీ 90 సంవత్సరాల వయసులో 2014 జనవరి 22న క్యాన్సర్తో ఆయన కన్నుమూశారు. అయితే చనిపోయేనాటికి ఏఎన్నార్ పరిస్థితి ఎలా ఉందనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. అలాంటి వ్యక్తుల్లో నటుడు కాదంబరి కిరణ్ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. ఏఎన్నార్ చివరి రోజుల్లో ఎలా ఉన్నాడు? ఎంత బాధ అనుభవించాడనే వాటిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
ఏఎన్నార్ తో కిరణ్ కు చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో కాదంబరి కిరణ్ నిర్మాణంలో మట్టి మనిషి సీరియల్ కూడా చేశాడు నాగేశ్వర రావు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ మరణించే ముందు ఎలా ఉన్నారనే విషయాల గురించి చెప్పారు. చివరి రోజుల్లో ఏఎన్నార్ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని కాదంబరి కిరణ్ తెలిపాడు. అంతేకాదు ఆయనను ముట్టుకుంటే చర్మం ఊడి వచ్చేది అంటూ అభిమానులకు తెలియని విషయాన్ని చెప్పాడు. ఆయన గదిలోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు.. కానీ తను మాత్రం అనుమతించేవారు అంటున్నాడు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తుల్లో నాగేశ్వరరావు అందరి కంటే ముందు ఉంటారని.. కేవలం నాగేశ్వరరావు కారణంగానే ఈరోజు తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను అంటున్నాడు ఈయన. ఏదేమైనా చివరి రోజుల్లో ఏఎన్నార్ పరిస్థితి అలా ఉండేదా అని తెలుసుకుని అభిమానులు బాధ పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్వాక్.. ఇన్స్టాలో కొత్త వీడియో