Kaali Poster Controversy | ఫిల్మ్మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 6న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. లీనా ‘కాళీ’ పేరిట తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్ జూలై 2న కెనడాలోని టోరంటోలో ఉన్న అగాయాన్ మ్యూజీయంలో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ పోస్టర్పై సామాజిక మాధ్యమాల్లో దూమారం రేపుతోంది.
దేవతామూర్తి కాళిక అమ్మావారి వస్త్రధారణలో ఉన్న ఈ పోస్టర్లో సిగరేట్ తాగుతున్నట్లుగా, ఎల్జీబీటీ కమ్యూనిటీ జెండాను చేతబూని ఉండడంతో పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని, నైతికత, మర్యాదలకు విరుద్ధమంటూ కోర్టులో వాది పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టు లీలాతో పాటు మణిమేకలై సంస్థ, టూరింగ్ టాకీస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. పోస్టర్ వివాదం నేపథ్యంలో ఇప్పటికే లీలాతో పాటు డాక్యుమెంటరీ నిర్మాతపై కేసులు నమోదయ్యాయి.