కళాతపస్వి, దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. నెల రోజుల వ్యవధిలో ఆయన సతీమణి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు.