అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా ఇది కావడం విశేషం. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్స్ మరియు కొసరాజు హరికృష్ణ అధ్వర్యంలోని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ‘ఈ చిత్రాన్ని త్వరలో లాంఛనంగా ప్రారంభించి జూన్ ద్వితీయార్థంలో సెట్స్పైకి తీసుకెళ్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్