ముంబై : బాలీవుడ్ నటుడు, ఎంట్రప్రెన్యూర్ జాన్ అబ్రహం (John Abraham) ముంబైలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దేశ వాణిజ్య రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన ఖర్ లింకింగ్ రోడ్లో ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాను జాన్ అబ్రహం ఏకంగా రూ. 70.83 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.
రియల్ఎస్టేట్ పోర్టర్ ఇండెక్స్ట్యాప్.కాంలో వివరాల ప్రకారం ఈ ప్రాపర్టీ 13,138 చదరపు అడుగుల విస్తీర్ణం కాగా, నవంబర్ 8న బంగ్లా గిఫ్ట్ డీడ్ రూపొందగా డిసెంబర్ 27న లావాదేవీ పూర్తయింది.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రవీణ్ నథాలాల్ షా కుటుంబం నుంచి జాన్ అబ్రహం ఈ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశాడు. విక్రేతలకు బాలీవుడ్ స్టార్ రూ. 70.83 కోట్లు చెల్లించగా నిర్మల్ భువన్ అనే పేరు గల ఈ బంగ్లా కోసం స్టాంప్ ట్యాక్స్ల కింద బీఎంసీకి మరో 4.25 కోట్లు చెల్లించాడు.
Read More :
Rice Price | భారీగా పెరిగిన బియ్యం ధరలు.. క్వింటాలు రూ.6,200