బాలీవుడ్ అగ్రనాయికలు ప్రియాంకచోప్రా, అలియాభట్, కత్రినాకైఫ్ ఒకే సినిమాలో కలిసి సందడి చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఫరాన్అక్తర్ రూపొందించబోతున్న ‘జీలే జరా’ చిత్రంలో ఈ నాయికాత్రయం నటించనున్నారు. ఫరాన్అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ చిత్రం రోడ్జర్నీ నేపథ్యంలో ముగ్గురు మిత్రుల మధ్య అనుబంధానికి దృశ్యరూపంలా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై ఇరవైఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి రోడ్ట్రిప్ కథాంశంతో ‘జీల్జరా’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫరాన్అక్తర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్పెట్టారు. ‘రోడ్ ట్రిప్ గురించి ఎవరైనా మీతో చెప్పారా?. నా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ముగ్గురు అగ్రహీరోయిన్లు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం. రోడ్షోను వీక్షించాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఫరాన్అక్తర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రియాంకచోప్రా బాలీవుడ్ సినిమాలో నటించబోవడం విశేషం. ఈ సినిమాలో అందరూ మహిళా తారాగణం నటిస్తారని ప్రియాంక తెలిపింది. ఫరాన్అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్చాహ్తాహై’ ‘జిందగీ న మిలేగా దోబారా’ చిత్రాలు కూడా రోడ్జర్నీ నేపథ్య కథలతో తెరకెక్కడం విశేషం.