అగ్ర కథానాయిక జాన్వీకపూర్లో భక్తి భావాలు చాలా ఎక్కువ. తిరుమల శ్రీవారిని తరచుగా దర్శించుకుంటుంది. ఎప్పుడు తిరుమల వచ్చినా అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ నెల 6న తన జన్మదినం సందర్భంగా కాలినడకన ఆమె శ్రీవారి దర్శనం చేసుకుంది. జాన్వీకపూర్తో ఆమె స్నేహితుడు శిఖర్ పహారియా కూడా తిరుమల దర్శనం చేసుకున్నారు. ఈ యాత్ర విశేషాలను తన తాజా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది జాన్వీకపూర్. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పంచుకుంది.
చెన్నైలోని తన స్వగృహం నుంచి బయలుదేరి తిరుపతికి మూడు గంటల్లో చేరుకున్నానని చెప్పింది. కాలినడక మార్గంలోని మొకాళ్ల మిట్ట వద్ద మొకాళ్లపై మెట్లెక్కానని చెప్పింది. ఇప్పటికీ యాభైసార్లు శ్రీవారిని దర్శించుకున్నానని, తనకెంతో ఇష్టమైన దేవాలయం ఇదని జాన్వీకపూర్ చెప్పింది. జాన్వీకపూర్ తల్లి దివంగత అందాల తార శ్రీదేవి కూడా శ్రీవారికి భక్తురాలే. ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనం చేసుకునేది. ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని జాన్వీకపూర్ కొనసాగిస్తున్నది. ప్రస్తుతం జాన్వీకపూర్ తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ఇటీవలే ప్రారంభమైన రామ్చరణ్ 16వ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.