శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెలుగులో ‘ఏమైంది ఈవేళ’ ‘బెంగాల్ టైగర్’ వంటి విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన కె.కె.రాధామోహన్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆయుష్శర్మ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. కాత్యాయన్ శివపురి దర్శకుడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ విషయాన్ని శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని, 2023లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. సుశ్రీమిశ్రా, విద్యా మాలపడే, జస్విందర్ గార్డనర్, రాశుల్ టాండన్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: విశాల్, తనిష్క్, చెట్టాస్, దర్శకత్వం: కాత్యాయన్ శివపురి.