నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నారీ చిత్రంతో. కొరియోగ్రాఫర్గా తనదైన పేరు సంపాదించుకున్న విజయ్ బిన్ని డైరెక్టర్గా తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సినిమాతో ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘డైరెక్టర్ కావడం నా డ్రీమ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చూశాక మొదట కొరియోగ్రఫీపై గ్రిప్ ఉండాలనిపించి ఇన్నాళ్లూ ఆగాను’ అన్నారాయన. ‘ఇంతకు ముందు నాగార్జున పాటలు చేశాను. అదే చొరవతో ఆయనకు కథ చెప్తే డైరెక్షన్ చేయమన్నారు.
కమర్షియల్ పంథాలోనే నా ైస్టెల్ చూపించే ప్రయత్నించాను. దర్శకుడిగా తొలి సినిమా ఆయనతో చేయడం నా అదృష్టం. డిఫరెంట్గా నాగ్ను చూపించడంలో సక్సెస్ అయ్యానని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. ‘అల్లరి నరేశ్కు నాగ్ అంటే పిచ్చి. ఇద్దరినీ ఈ ఫ్రెండ్షిప్ స్టోరీలో పెడితే బావుంటుందనిపించింది. మరో పాత్రకు యంగ్ యాక్టర్ కావాలని రాజ్తరుణ్ని తీసుకున్నాం. ముగ్గురి కథలూ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? వాళ్ల మధ్య పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరం’ అని వివరించారు.
‘ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తే సినిమా ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ ప్రాజెక్టుతో నేర్చుకున్నాను. కీరవాణి గారు ఎప్పుడూ నన్ను కొత్త దర్శకుడిగా చూడలేదు. కొరియోగ్రఫీ నేపథ్యం ఉన్న నేను ఏదైనా చెప్తే ఓ సెన్స్తోనే చెప్తున్నారని భావించారు. ఏఎన్నార్ఆర్ గారి ప్రజాదరణ పొందిన పాటే టైటిల్ అయితే బావుంటుందని అందరం అనుకొని దాన్నే ఖరారు చేశాం’ అని చెప్పారు. ‘విజయ్, దినేష్ మాస్టర్ చెరో పాట చేయగా, మిగతా నాలుగు పాటలకు కొరియోగ్రఫీ చేశా. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా అన్ని జోనర్ సినిమాలూ చేయాలనుంది’ అన్నారు విజయ్.