Dil Raju | టాలీవుడ్ సినీ ప్రముఖుల నివాసాల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడుల (IT Raids) పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాత రాజు (Dil Raju) ఇండ్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతోపాటు ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాలతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, దిల్ రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిసిందే.
తాజాగా దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిసినట్టు సమాచారం. ఐటీ అధికారులు ఆయన ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతం దిల్ రాజును ఐటీ అధికారులు తమ వాహనంలో సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ కార్యాలయంలో సోదాలు కొనసాగిస్తున్నారు.
ఐటీ అధికారులు సినిమాలు, వచ్చిన లాభాలపై దిల్ రాజును ఆరా తీశారు. దిల్ రాజు సోదరుడు విజయ సింహా రెడ్డి కూడా సోదాలు నిర్వహించారు. ఆటో మొబైల్ రంగంలో విజయ సింహారెడ్డి వ్యాపారం చేస్తుండగా.. అన్నాదమ్ముల మధ్య లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఐటీ అధికారులు తనిఖీల్లో భాగంగా సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంతోపాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగించారు.
ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదు..
ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారని తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. తాను విజయ్తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు విజయ్కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చామి.. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం.
ఐటీ అధికారులు సోదాల్లో భాగంగా ఇప్పటికే దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంక్కు తీసుకెళ్లారు. అధికారులు బ్యాంకు వివరాలు కావాలని అడిగితే బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని తేజస్విని ఇప్పటికే మీడియాతో చెప్పారు.
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?