అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్లో వున్న ఈ చిత్రం సీక్వెల్ ‘పుష్ప-2’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో క్రేజీ కథానాయిక సాయిపల్లవి నటిస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది.
అంతేకాదు ఈ చిత్రంలో ఆమెది అత్యంత కీలకపాత్ర అని, ఆమె పాత్ర నచ్చడంతో సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఇందుకు గాను ఆమె పది రోజులు డేట్స్ కేటాయించడం జరిగిందని ప్రచారం జోరందుకుంది. అయితే ‘పుష్ప’ చిత్ర బృందం తెలిపిన విశ్వసనీయ సమచారం ప్రకారం ఈ చిత్రంలో సాయిపల్లవి నటించడం లేదని, ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం సాయిపల్లవి కొత్త సినిమా గురించి ఎటువంటి అప్డేట్ అధికారికంగా ఏమీ రాలేదు.