ఈ ఏడాది తమ సంస్థ 50 చిత్రాల మైలురాయిని అందుకుంటుందనే నమ్మకం ఉందని, ఇక నుంచి ప్రతీ నెలా ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘ఈగల్’ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటించారు. తాజా చిత్రాలతో పాటు తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.