అగ్ర కథానాయిక ఇలియానా స్వల్ప అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, ఆసుప్రతిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఫొటోల్ని షేర్ చేస్తూ ‘ఇప్పటికే మూడు బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ముగ్గురు వైద్యులు నాకు చికిత్స అందించారు.
డీహైడ్రేషన్ నుంచి కాస్త కోలుకున్నా. ఇప్పుడు అంతా బాగుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో త్వరగా కోలుకున్నా. ఈ సమయంలో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు, చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది. తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన ఇలియానా కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటున్నది.