అబుదాబి : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA-2022) వేడుకలు వాయిదాపడ్డాయి. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఐఫా వేడుకలు ఈ నెల 18 నుంచి 22 వరకు అబుదాబిలో జరుగాల్సి ఉన్నది. యూఏఈ అధ్యక్షుడి మరణానికి ప్రభుత్వం 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ క్రమంలో ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా యుఏఈ ప్రెసిడెంట్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఐఫా ఓ మెసేజ్ను పోస్ట్ చేసింది.
‘యుఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. భగవంతుడు ఆయనపై దయను ఉంచి శాంతిని అందించాలని కోరకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. అవార్డ్స్ ఫంక్షన్ను మళ్లీ జూలై 14, 15, 16 తేదీల్లో అబుదాబీలో నిర్వహించనున్నట్లు చెప్పింది. ఐఫా 22వ ఎడిషన్కు సల్మాన్ ఖాన్, రితేశ్ దేశ్ముఖ్ హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. ఈ వేడుకల్లో వరుణ్ ధావన్, అనన్య పాండే డ్యాన్స్ ప్రదర్శనలివ్వనున్నారు.
With the sad news of His Highness Sheikh Khalifa Bin Zayed Al Nahyan, President of UAE passing away we share our deepest condolences with his family and the people of UAE. May God have mercy on him and grant him eternal peace. pic.twitter.com/tnd5JSBF6m
— IIFA (@IIFA) May 14, 2022