Bison Telugu Release | చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా నటించిన చిత్రం ‘బైసన్’. పా. రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో ఇప్పటికే విజయం సాధించిన ఈ చిత్రం, అక్టోబర్ 24న జగదంబే ఫిల్మ్స్ బ్యానర్పై తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 21) చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ సహా చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు.
హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘బైసన్’ను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను. అలా నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారింది. నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్లా ఉన్నారు’ అని అన్నారు. అవును.. నేను ఆయన కొడుకుని అని చెప్పాను. మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను. నాకు తెలుగులో నటించాలని ఉంది. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్న గారిలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. ‘మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ గారు తెరకెక్కించారు. ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ చూడండి’ అని ధృవ్ అన్నారు.
అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ.. మారి సెల్వరాజ్ గారి మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువైంది. మేం అక్టోబర్ 24న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ధృవ్కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందని, ఎంతో కష్టపడ్డాడు అని నేను రిలీజ్కు ముందు చెప్పాను. ఇప్పుడు అవే మాటలు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. ధృవ్తో నటించడం నాకు గర్వంగా ఉంది. నివాస్ మాకు అద్భుతమైన పాటలు, మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్. అక్టోబర్ 24న ‘బైసన్’ తెలుగులో రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి అని అన్నారు.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ .. బైసన్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. లింగుస్వామి, నా సోదరుడు చంద్రబోస్ గారి వల్లే తెలుగులోకి ఈ మూవీని తీసుకు వస్తున్నాను. ఇది గొప్ప విజయం సాధిస్తుంది, చాలా మంచి చిత్రం అని లింగుస్వామి గారు మాకు సలహా ఇచ్చారు. ఈ మూవీని నేను చూశాను. తెలుగు ఆడియెన్స్కి తప్పకుండా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది. మాకు ఈ మూవీని ఇచ్చిన నీలం స్టూడియోస్, దీపక్, పా రంజిత్ గార్లకు థాంక్స్. ధృవ్ ఎంత కష్టపడ్డాడు అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అనుపమ గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తెలుగులో అక్టోబర్ 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నీలం స్టూడియోస్ వీపీఆర్ మాట్లాడుతూ .. బైసన్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న బాలాజీ గారికి థాంక్స్. బోస్, బాలాజీ గారి పట్టుదల వల్లే తెలుగులో ఇంత గ్రాండ్గా ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి అని అన్నారు.
సంగీత దర్శకుడు నివాస్ కె. ప్రసన్న మాట్లాడుతూ .. ‘‘బైసన్’ తెలుగు ప్రమోషన్స్కి రావడం ఆనందంగా ఉంది. బాలాజీ గారికి కంగ్రాట్స్. ‘బైసన్’ ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్ అయింది. ఈ మూవీ ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుంది. ధృవ్ నాకు మంచి స్నేహితుడు. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ మూవీతో నాకు అనుపమ లాంటి మంచి ఫ్రెండ్ దొరికారు. తెలుగు ఆడియెన్స్, మీడియా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు : ధృవ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, అళగం పెరుమాల్, అరువి మధన్, అనురాగ్ అరోరా తదితరులు.
సాంకేతిక బృందం
బ్యానర్ : అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్
తెలుగు రిలీజ్ : జగదంబే ఫిల్మ్స్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్
దర్శకుడు: మారి సెల్వరాజ్
సహ నిర్మాత: సునీల్ చైనాని, ప్రమోద్ చెరువులత్, ప్రసూన్ గార్గ్, మనీంద్ బేడి
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సాహిత్యం : మారి సెల్వరాజ్, అరివు
కెమెరామెన్ : ఎళిల్ అరసు కె
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్పన్
ఎడిటర్ : శక్తి తిరు
పీఆర్వో : హర్ష