Chiranjeevi | నరసాపూర్లో శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ (Sri Yerramilli Narayana MurthyCollege) (పశ్చిమగోదావరి జిల్లా) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi). ఈ కార్యక్రమంలో చిరంజీవిని స్నేహితులు, కాలేజీ యాజమాన్యం సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా.. కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానన్నాడు చిరంజీవి.
రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కటువుగా, మొరటుగా ఉండాలి. సున్నితంగా ఉండకూడదు. మాటలు అన్నా..అనకపోయినా.. అనాలి..అనిపించుకోవాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా..? అని అనిపించిందన్నాడు. పవన్ కల్యాణ్ పేరు వినగానే.. రాజకీయాలకు పవన్ కల్యాణ్ (Pawankalyan) తగినవాడు. పవన్ కల్యాణ్ మాటలు అంటాడు.. పడతాడు. పవన్ కల్యాణ్కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో మనం ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ను అత్యున్నత స్థానంలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు చిరంజీవి.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. మరోవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ కూడా చేస్తున్నాడు చిరు.
Read Also : Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాలహారం.. కృతిశెట్టి ఫొటోలు వైరల్
Read Also :Matti Kusthi Trailer | ప్రేమ వర్సెస్ కుస్తీ.. విష్ణువిశాల్ మట్టి కుస్తీ ట్రైలర్
Read Also :Hrithik Roshan | క్యూరియాసిటీ సహజమే.. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదు: హృతిక్ రోషన్