ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్పై ఇటీవల ఆయన భార్య షాలిని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 118 పేజీల ఫిర్యాదు ఆమె అందజేయగా అందులో సంచలన విషయాలు వెల్లడించింది. హనీసింగ్.. అతని కుటుంబ సభ్యులు.. తనని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
తనతో పెళ్లి విషయాన్ని హనీసింగ్ ఎవరికీ చెప్పకుండా ఎంతో రసహ్యంగా ఉంచాడని..నేను షేర్ చేసినందుకు, నన్ను చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె వాపోయింది. ఒకసారి కనీసం 18 గంటలపాటు తనకు కనీసం భోజనం కూడా పెట్టలేదని.. ఒక గదిలో బంధించి ఉంచాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వేరే మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దానిపై నిలదీస్తే తనపైకి మందు బాటిల్ విసిరాడని ఆమె తీవ్రంగా ఆరోపించింది.
తన భార్య షాలిని చేసిన ఆరోపణలపై హనీ సింగ్ స్పందించాడు. నాపై, నా కుటుంబానిపై షాలిని చేసిన ఆరోపణలు నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ చాలా అసహ్యంగా ఉన్నాయి. నా మ్యూజిక్పై, ఆరోగ్యంపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఏ నాడు స్పందించలేదు. ఈ సారి మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లె మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది.
మా పరువుకు భంగం కలిగించేలా ఆమె ఆరోపణలు చేయడం బాధను కలిగిస్తుంది. ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్న నేను ఎంతో మందితో కలిసి పని చేశాను . నా భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసు. ఎందుకంటే షూటింగ్లు, ఈవెంట్లకు ఆమెను కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడిని. ఆమె అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాను. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజం వస్తుందని ఆశిస్తున్నా.అప్పటి వరకు నా ఫ్యామిలీ గురించి, నా గురించి తప్పుగా భావించొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా అని హనీసింగ్ పేర్కొన్నారు.