న్యూఢిల్లీ : హాలీవుడ్ స్టార్ మైఖేల్ డగ్లస్ (Michael Douglas) తన కుటుంబంతో కలిసి భారత్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. బంగాళా ఖాతం నుంచి ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికలో షేర్ చేశారు.
భారత్ అద్భుతంగా ఉందని వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. మేం ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ వద్ద ఉన్నాం..ఇది అసాధారణ దేశం, సౌత్ో ఎంజాయ్ చేస్తున్నాం, అద్భుతమైన వ్యక్తులతో సమయం గడుపుతున్నాం..కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ ఆస్వాదిస్తున్నాం..అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో డగ్లస్ భార్య, నటి కేథరిన్ జెటా జోన్స్ కుమారుడు లంచ్ చేస్తూ కనిపించారు. మైఖేల్ ఈ వీడియోను పోస్ట్ చేయగానే కామెంట్స్ సెక్షన్లో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రియాక్టయ్యారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా మైఖేల్కు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
Read More :