హైదరాబాద్: హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించాడు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, గత వారం రోజులుగా తనను రోజులుగా కలిసిన వాళ్లందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పాడు. ఎప్పటికీ మీ ప్రేమ, ఆశీర్వాదాలు తనతోనే ఉంటాయని.. తనకు ఏమీకాదన్నాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.