గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘గల్లీ సౌండుల్లో’ విడుదలైంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటను సంతోష్ వెంకీ ఆలపించారు. గోపీచంద్ పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
నేరస్థులను భయపెట్టే ఓ స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ మాస్ బీట్లో ఈ పాట ఆకట్టుకుంది. ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని..మాస్, ఫ్యామిలీ, యాక్షన్ అంశాల కలబోతగా సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జూ మహంకాళి, దర్శకత్వం: ఏ.హర్ష.