హైదరాబాద్: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మృతి తీవ్రంగా కలిచివేసిందని సీనియర్ బాలకృష్ణ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు చెరగని ముద్ర వేశారని చెప్పారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. కృష్ణంరాజుతో కలసి తాను రెండు చిత్రాల్లో నటించానని, అది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవని పేర్కొన్నారు. ఆయన పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
రెబల్ స్టార్ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. #KrishnamRaju pic.twitter.com/JrGpnhecww
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) September 11, 2022
చిత్రపరిశ్రమకు నేడు దుర్దినం: మహేశ్ బాబు
‘కృష్ణంరాజు ఇకలేరన్న వార్త నన్ను షాక్కు గురిచేసింది. నిజంగా ఈ రోజు నాకు, చిత్ర పరిశ్రమకు దుర్దినం. ఆయన జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Shocked to learn that Krishnam Raju garu is no more… A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022
సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తంచేశారు. కృష్ణంరాజు మృతి నిజంగా బాధాకారం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
Deeply saddened by Krishnam Raju Garu's passing away. I extend my heartfelt condolences to his family. May his soul rest in peace…
— Jr NTR (@tarak9999) September 11, 2022
సోదర సమానుడైన కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత తనకు మాటలు రావడం లేదని మోహన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
I am at loss of words! #KrishnamRaju my brother.
— Mohan Babu M (@themohanbabu) September 11, 2022
దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతిపై హీరోయిన్ అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అందరి హృదయాల్లో ఆయన జీవించి ఉంటారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022