‘జనతా గ్యారేజ్’ అద్వితీయ విజయం తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో వాణిజ్య హంగులకు హీరోయిజాన్ని మేళవిస్తూ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్కు జోడీగా నటించే నాయిక విషయంలో దక్షిణాదితో పాటు పలువురు బాలీవుడ్ తారల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ ఆ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’తో తెలుగులో అరంగేట్రం చేసిందీ సొగసరి. ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెతో ఇటీవలే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కథ, పాత్రచిత్రణ నచ్చడంతో కియారా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు పాడవ్వకూడదని తపన పడే లీడర్గా ఆయన పాత్ర శక్తివంతంగా సాగనుందని తెలిసింది. కల్యాణ్రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న 30వ చిత్రమిది. కరోనా సెకండ్వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.