Hanuman Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్ (Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. అయితే థియేటర్లో విడుదలై రెండు నెలలకు పైగా అయిన ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
అయితే ఓటీటీ వాయిదా పడుతూ వస్తుండటంపై తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా స్పందించాడు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావడం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదు. మేము రాత్రింబవళ్లు కష్టపడి మీకు బెస్ట్ అవుట్పుట్ అందించాలని చూస్తున్నాము. మా ఉద్దేశ్యం ఎల్లప్పుడూ మీకు ఉత్తమమైనది ఇవ్వాలని చూస్తాము కానీ మరేమీ లేదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మాకూ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు అంటూ ప్రశాంత్ వర్మ రాసుకోచ్చాడు.
#HanuMan OTT streaming delay was not intentional!
We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap!
Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗…
— Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024
ఇక ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో హనుమాన్’ సీక్వెల్ రాబోతుండగా.. ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.