Ranveer Singh | ‘హను-మాన్’ దర్శకుడు ప్రశాంత్వర్మ ముంబయ్లో రణవీర్ సింగ్ని కలిశారు. ఈ కలయిక ప్రస్తుతం ముంబయ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా రణవీర్ శక్తిమాన్ తరహా పాత్ర చేయనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘హను-మాన్’ తర్వాత ‘జై హనుమాన్’ చేయనున్నట్టు ప్రశాంత్వర్మ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలవడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రణ్వీర్ చేయనున్న ఆ శక్తిమాన్ హనుమంతుడే అంటూ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. మరి రణ్వీర్ని ప్రశాంత్వర్మ ‘జై హనుమాన్’ కోసం కలిశారా? లేక ‘జై హనుమాన్’ తర్వాత తాను చేయబోయే మరో సినిమా కోసం కలిశారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.