Cinema News | ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ రాజుల బళ్లారి నిర్మాత. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఆశిష్గాంధీ మాట్లాడుతూ ‘ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదొక అద్బుతమైన కథ. దర్శకుడు, నేను స్నేహితుల్లా ట్రావెల్ అయ్యాం.
నిర్మాత వీరేశ్ చాలా సపోర్ట్ చేశారు. సాంకేతికంగా కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందీ సినిమా’ అన్నారు. కృష్ణార్జునులు లాంటి ఇద్దరు స్నేహితులు వారికి వచ్చిన సమస్యలని ఎలా పరిష్కరించుకున్నారు? అనే ప్రశ్నకు సమధానమే ఈ సినిమా అని, యువతరానికి నచ్చే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు.
స్నేహం నేపథ్యంలో సినిమాలన్నీ ఎక్కువశాతం విజయాలను అందుకున్నాయని, అదే దారిలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని మరో అశోక్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని కథానాయిక హ్రితిక చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.