ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది శూన్యం
ఎంపీ నిధులు కూడా ఇవ్వలేదు
ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
కలెక్టర్ భారతీ హోళికేరి,ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి స్వచ్ఛట్రాక్టర్ల ప్రారంభం
లక్షెట్టిపేట రూరల్, జూలై 1 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాని అన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆవరణలో కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే దివాకర్ రా వుతో కలిసి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి న మూడు స్వచ్ఛ ట్రాక్టర్లును గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్నారు. గత ఏడేళ్లలో రాష్ర్టానికి చేసింది శూన్యమని, కనీసం ఎంపీ నిధులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. తెలంగా ణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులకు కనపడుతలేదా..? అని ప్రశ్నించారు. ప్రజలు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల లక్షెట్టిపేట మున్సిపాలిటీకి రూ. 20 లక్షల నిధులు కేటాయిస్తున్నాదన్నారు. ఏడాదికి రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రూ. 4 కోట్లతో లక్షెట్టిపేటలో మార్కెట్ను నిర్మిస్తున్నామని చెప్పారు. సుమా రు రూ. 25 లక్షలతో మూడు ట్రాక్టర్లు, రెండు ట్యాం కర్లు, డోజర్ను కొనుగోలు చేశామన్నారు. గత హరితహారంలో నాటిన మొక్కలను 98 శాతం వరకు బతికించుకున్నామన్నారు. గతంలో పారిశుధ్య కార్మికులకు రూ. రెండు, మూడు వేల వేతనం మాత్రమే ఇచ్చేవారని తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక వారికి రూ. 12 వేలు ఇస్తున్నామన్నారు.
సుస్థిర అభివృద్ధికి పట్టణ ప్రగతి, హరితహారం : కలెక్టర్ భారతీ హోళీకేరి
పల్లె, పట్టణం సుస్థిర ప్రగతి సాధించాలంటే పరిశుభ్రత, పచ్చదనం అవసరమని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. పరిశుభ్రత వలన రోగాలు దరిచేరవని, పచ్చదనం వలన సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిభా సింగ్, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్, లావుఢ్యా సురేశ్ నాయక్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, బాణాల రమేశ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ ఆకుల వెంకటేశ్ చెత్తబుట్టలను పంపిణీ చేశారు.