అమరావతి : దర్శకుడు(Ramgopal varma) రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘ వ్యూహం’ సినిమాకు సెన్సార్ (Sensor Borad) అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు (High Court) సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును విడుదల చేయడంతో ఈనెల 16న సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత సిద్ధం చేసుకున్నారు. కాగా రెండు నెలలక్రితమే సినిమాను పూర్తి చేసుకున్న చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్ను సాధించి విడుదలకు సిద్ధం చేసింది.
సినిమాలో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచేవిధంగా ఉందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్తో (Nara Lokesh) పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా పిటిషన్లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికేట్ను జారీ చేసింది.