హైదరాబాద్: తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దడానికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ చాలెంజ్ను స్వీకరించి అనేక మంది పర్యావరణ పరిరక్షణ కోసం మేము సైతం అంటూ మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని తద్వారా మంచి ఆక్సిజన్ పొందుతామని చెప్పారు. రాబోయే తరాలకు చెట్ల ఉపయోగాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అనంతరం తన స్నేహితులైన లోబో, తనూజా, ఉమకు సవాల్ విసిరారు.