ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతున్నది. గురువారం గ్రీన్ఇండియాచాలెంజ్లో పాల్గొన్న కథానాయిక మెహరీన్ రామానాయుడు స్టూడియోలో మొక్కను నాటింది. ఈ సందర్భంగా మెహరీన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు నాటడం అవసరమని చెప్పింది. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని తెలిపింది.