విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’. కాలకేయ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, డాక్టర్ భద్రం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సాయిశివన్ జంపాన దర్శకుడు.
యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయిశివన్ మాట్లాడుతూ…‘సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. అర్థవంతమైన మాటలు, ఆకట్టుకునే ఫైట్స్ ఉంటాయి. ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నది.
సినిమాకూ ఇలాంటి ఆదరణే ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’ అన్నారు. సోనియా చౌదరి, అలోక్ జైన్, జ్యోతిరానా ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సామల భాస్కర్, సంగీతం : వర్ధన్.