‘దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన సేవలను మర్చిపోలేం. ఆయన గురించి మరిన్ని కొత్త విషయాలతో సినిమా తెరకెక్కిస్తా’ అంటున్నారు పీవీ మనవరాలు అజిత. ఇందుకోసం తెరాస ఎమ్మెల్సీగా పనిచేస్తున్న తల్లి వాణీదేవి సలహాలు తీసుకుంటానని ఆమె చెప్పారు. పీవీ బహుబాషా ప్రావీణ్యం, రాజకీయ చాతుర్యంతో పాటు అనేక ఆసక్తికర సంగతులను ఈ చిత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు.
పలు విద్యా విభాగాలతో కళాశాలలు నిర్వహిస్తున్న అజిత ఆ కాలేజీల ప్రాంగణంలోనే తాజాగా ఆడియో, వీడియో, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పారు. ఆమె మాట్లాడుతూ..‘త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించాలని ఉంది. మా దగ్గర ఉన్న డబ్బింగ్, ఎడిటింగ్ వంటి సాంకేతిక యూనిట్ల ద్వారా సినీ రంగానికి మా వంతు సేవ చేయాలని భావిస్తున్నాం. త్వరలోనే తాతగారు పీవీ నరసింహారావు బయోపిక్ తెరకెక్కిస్తాం’ అన్నారు.