హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. సిరివెన్నెల నివాసానికి మంగళవారం వెళ్లిన గవర్నర్.. ఆయన భార్యను ఓదార్చారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు గవర్నర్ ధైర్యం చెప్పారు.
తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సిరివెన్నెల నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల సుమారు 800 సినిమాలకు దాదాపు 3 వేల పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు అందుకున్నారు.