గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’కు సంబంధించిన టీజర్ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెలుగులో చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కేకే రాధామోహన్ లావిష్గా నిర్మిస్తున్నారు. ‘యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అనే భగవద్గీత శ్లోకంతో పవర్ ఫుల్ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమైంది. ‘ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మాసివ్, వైల్డ్ అవతారంలో గోపీచంద్ ఎంట్రీ ఆకట్టుకుంది.
ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్లో గోపీచంద్ను చూడటమంటే అభిమానులకు పండగే. టీజర్లో విజువల్స్ గొప్పగా ఉన్నాయి. హర్ష తన అద్భుతమైన టేకింగ్తో ఆకట్టుకున్నాడు. స్వామి జె గౌడ కెమెరా పనితనమూ అద్భుతంగా తోచింది. సలార్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సెన్సేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదనపు ఎనర్జీని జోడించారు. మొత్తానికి ఈ టీజర్ సినిమాకు హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ‘భీమా’ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుందన్న విషయాన్ని ఈ టీజర్ ద్వారానే అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: స్వామి జె గౌడ, నిర్మాత: కేకే రాధామోహన్, దర్శకత్వం: ఎ.హర్ష.