తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. ఆ సినిమా పరాజయంతో రెండేళ్లు ఖాళీగా ఉన్నాడు. ఎవరూ కనీసం ఈయన వైపు చూడలేదు. అలాంటి సమయంలో తేజ తెరకెక్కించిన జయం సినిమాతో ప్రతినాయకుడిగా మారాడు గోపీచంద్. అది బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు గోపీచంద్ మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అదే స్పీడ్ లో నిజం, వర్షం సినిమాల్లో విలన్గా నటించాడు. తన విలనిజంతో నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో నెంబర్ వన్ విలన్గా ఉన్నాడు గోపీచంద్. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ విలన్ దొరికాడని అనుకుంటున్న సమయంలోనే యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు.
ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన యజ్ఞం సినిమా సంచలన విజయం సాధించింది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి వరకు విలన్గా ఆకట్టుకున్న గోపీచంద్.. యజ్ఞం సినిమాలో హీరోగానూ సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు రవికుమార్ చౌదరి ముందు అనుకున్న హీరో గోపీచంద్ కాదు.. ప్రభాస్ కోసం ఈ కథ రాసుకున్నాడు రవికుమార్ చౌదరి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు కథ కూడా చెప్పాడు. అది ఆయనకు నచ్చింది. అయితే అదే సమయంలో బి.గోపాల్ దర్శకత్వంలో అడవి రాముడు సినిమాకు కమిట్ అయ్యాడు ప్రభాస్.
సీనియర్ దర్శకుడు కావడంతో యజ్ఞం కంటే కూడా అడవి రాముడు వైపు ప్రభాస్ అడుగులు పడ్డాయి. దాంతో ఈ సినిమాకు గోపీచంద్ను హీరోగా తీసుకున్నాడు రవికుమార్ చౌదరి. యజ్ఞం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు గోపీచంద్. ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి విజయాలతో స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో నటించిన సీటీమార్ సెప్టెంబర్ 10న వినాయకచవితి కానుకగా విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు గోపీచంద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
ఈ ప్రమోషన్కి డబ్బులు ఏమి తీసుకోలేదు: రేణూ దేశాయ్