పవన్ కళ్యాణ్ మాజీ భార్య, మల్టీ టాలెంటెడ్ పర్సన్, సేవా ధృక్పథం ఉన్న వ్యక్తి రేణూ దేశాయ్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రేణూ దేశాయ్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య అకీరా కర్రసాము వీడియా, ఆ తర్వాత ఆద్య.. తన అన్నయ్యకి రాఖీ కట్టే ఫొటో, ఉత్తేజ్ కూతురు పాట సాంగ్ పాడుతుంటే అకీరా కీ బోర్డ్ ప్లే చేయడం వంటివి తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాలోవర్స్కి మంచి వినోదం అందించింది.
సోషల్ మీడియా ద్వారా ఎంటర్టైన్ చేయడమే కాదు మంచి మెసేజ్లు కూడా ఇస్తుంటుంది. రీసెంట్గా తాను శాఖాహారిగా మారానని, జంతువుని చంపి తినడం తనకెంతో బాధ కలిగిస్తున్నట్టుగా పేర్కొంది. ఇక తాజాగా వినాయక చవితిని ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో రేణూ.. సీడ్ గణేశుడిని వాడండని చెప్పుకొచ్చింది. దీని కోసం ఓ సంస్థ వేసిన యాడ్ను రేణూ దేశాయ్ షేర్ చేశారు. అయితే డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసే యాడ్ అనుకుంటారేమోనని భావించిన రేణూ.. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదని, డబ్బులు ఏమీ తీసుకోలేదని చెప్పేశారు.