National Cinema Day | సినిమా లవర్స్కు గుడ్న్యూస్. కేవలం రూ.75కే మల్టీప్లెక్స్లో సినిమా చూసే అవకాశం రాబోతుంది. మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా( MIA) సెప్టెంబర్ 16న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4000వేల మల్టీప్లెక్స్ థియేటర్లలో కేవలం రూ.75కే సినిమా చూసే అవకాశాలన్ని ప్రేక్షకులకు కల్పిస్తుంది. చాలా మంది ప్రేక్షకులకు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని ఆశగా ఉంటుంది. కానీ టిక్కెట్ రేట్ల కారణంగా వెనకడుగు వేస్తుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళందరూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల టిక్కెట్ రేట్ల కంటే సగం తక్కువ ధరతోనే మల్టీప్లెక్స్లో సినిమా చూడోచ్చు.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకుల కోసం 75 రూపాయిలకే సినిమాను చూపించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 16 ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తాజాగా యూఎస్ఏలో ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా కేవలం 3 డాలర్లకే(Rs 240) ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇక అక్కడ కేవలం రెండు తెలుగు సినిమాలకే దాదాపు 50వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ఈ స్ట్రాటజీ ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 16న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘K3 కోటికొక్కడు’, ‘శాకిని డాకిని’ వంటి తెలుగు చిత్రాలను 75రూపాయలకే మల్టీప్లెక్స్లో చూడవచ్చు. వీటితో పాటుగా సెప్టెంబర్ 9న విడుదలవుతున్న ‘బ్రహ్మస్త్ర’, ‘ఒకే ఒక జీవితం’, ‘కెప్టెన్’ సినిమాలు కూడా అదే ధరకు చూసే అవకాశం దక్కనుంది. ఇక మధ్య కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తగ్గింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 16న ఎక్కువ మొత్తంలో థియేటర్లలోకి ప్రేక్షకులు వచ్చే చాన్స్ ఉంది.
National Cinema Day will be held at more than 4000 participating screens and will include cinema screens of PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITYPRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE and many others. pic.twitter.com/nVpM5neXd1
— Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022