టాలీవుడ్ (Tollywood) యాక్టర్ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ (Sports bike) స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లడంతో సాయిధరమ్ తేజ్ కు కాలర్ బోన్ (collar bone surgery) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. సాయిధరమ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే రోడ్డుపై ఇసుక ఉండడంతో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయినట్టు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు అధికారులు.
ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. మాధాపూర్-ఖానామెట్ రోడ్డుపై నిర్మాణ రంగ వ్యర్థాలు పేరుకపోవడంతో..అరబిందో కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థపై జీహెచ్ ఎంసీ రూ.1 లక్ష జరిమానా విధించింది. సెప్టెంబర్ 13న జరిమానా విధించిన ధ్రువీకరణ పత్రం ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సాయిధరమ్ తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు.
సాయిధరమ్ తేజ్ ను పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. త్వరలోనే ఈ యువ హీరో పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?