Ghantasala | పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు ఆలాపించిన భగవద్గీత మన అందరి జీవితాల్లో మరిచిపోలేని ముద్ర వేసిందని ప్రముఖ సంగీత దర్శకులు దేవీ శ్రీప్రసాద్ చెప్పారు. ఆయన ఆలాపించిన ఘంటసాల వినడం మనతరంతోపాటు భవిష్యత్ తరాలు చేసుకున్న అదృష్టం అని తెలిపారు. ఘంటసాల శత జయంతి సందర్భంగా ఆయనకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ నిర్వహించిన ఘంటసాల శత గళార్చన కార్యక్రమంలో దేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఘంటసాల గొప్ప గాయకులు, సంగీత దర్శకుడిగా గొప్ప విజయం సాధించారన్నారు. తనకు తెలిసినంత వరకు సినీ జగత్తులో ఇటువంటి అర్హత సాధించిన వారు ఆయన ఒక్కరేనన్నారు. ఘంటసాల పాడిన పాటలతో గొప్పగొప్ప వ్యక్తులు కూడా ప్రేరణ పొందారన్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల చరిత్ర సృష్టించారన్నారు.
ఘంటసాల పాడిన భగవద్గీత మనందరి హృదయాల్లో ఎప్పటికీ మరిచిపోలేని ముద్ర వేసిందని దేవీశ్రీప్రసాద్ పేర్కొన్నారు. నాటి నుంచి ఇప్పటి తరం, భవిష్యత్ తరాల వరకు ఈ లోకం ఉన్నంత కాలం మిగిలిపోయేది భగవద్గీత అని అన్నారు. జననం మొదలు మరణం వరకు సంగీత పరంగా జీవితమంతా భగవద్గీత ఒక్కటే ఆక్రమించుకున్నదని చెప్పారు. అంత గొప్ప అవకాశం రావడంతో ఘంటసాల నిజంగా కారణజన్ములయ్యారని పేర్కొన్నారు. అటువంటి ఘంటసాల గురించి మాట్లాడటం తన అదృష్టం అని చెప్పారు. ఆయనకు భారత్రత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చాగోష్టి సాగింది. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి రత్నకుమార్ కవుటూరుతో పాటు వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వంశీ రామరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ నుండి నీలం మహేందర్, సుబ్బు వీ పాలకుర్తి, తోట సహదేవుడు, వేణు మల్లవరపు, రామాంజనేయులు చామిరాజు, అనంత్ బొమ్మకంటి, రవి విశ్వాత్ముల, గుంటూరు వెంకటేష్, ప్రమీల గోపు, శ్రీని జాలిగామ పాల్గొన్నారు. నీలిమ గడ్డమణుగు బృందం నుంచి శ్రీకాంత్ లంక, హిరణ్య ఆత్రేయపురపు, సుబ్బు ఆత్రేయపురపు, శ్రవణ్ మట్ల పూడి, శాంతకుమారి మేడిచర్ల, సాయి శిరీష లంక, విజు కాకతీయ చిలువేరు, మైత్రి సంస్థ వ్యవస్థాపకులు, అట్లాంటా, USA బృందం నుంచి శారదా సాయి (హైదరాబాద్), రాఘవ బాబు తడవర్తి, గాయత్రి తంగిరాల, ఫణి వంశీ ముడుంబ హాజరయ్యారు. అమెరికాలోని అట్లాంటా నుంచి రామ్ దుర్వాసుల బృందం నుండి దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్ కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు.. ఘంటసాల పాటలు పాడి ఆయన్ను స్మరించుకున్నారు. ఇంకా తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఘంటసాలకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలని 165కు పైగా టీవీ చర్చాగోష్టులు నిర్వహించారు. ఈ చర్చాగోష్టుల్లో ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ దర్శక రచయిత, నటులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 10 మంది సహ నిర్వాహకులు నిర్వహించారు. వారిలో విజు చిలువేరు, రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతల ఉన్నారు. వీరితోపాటు ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా గాయకులు ఘంటసాల శత గళార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి భాగం ఈ నెల 21న, మలి విడత భాగం ఈ నెల 28 (ఆదివారం) ప్రసారం చేశామని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 4, 11 లలో మిగతా రెండు భాగాలు ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమానికి సహాయ, సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, పాల్గొన్న వారికిబాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాయం చేయాలనుకుంటే ghantasala100th@gmail.com అనే ఈ-మెయిల్కు వివరాలు పంపాలని కోరారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ప్రారంభించిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తున్నదని నిర్వాహకులు తెలిపారు. మీ అందరి కోసం ఆ వివరాలు : https://www.change.org/BharatRatnaForGhantasalaGaru