ముఖేష్గౌడ్, ప్రియాంక శర్మ జంటగా రూపొందుతోన్న ప్రేమకథాచిత్రం ‘గీతా శంకరం’. రుద్ర దర్శకత్వంలో కె.దేవానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నది. మరోవైపు ఈ సినిమా పాటల రికార్డింగ్ని పూర్తి చేశారు.
మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న చిత్రమిదని, భావోద్వేగాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నదని, త్వరలో ప్రమోషన్స్ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. కొత్తదనంతో కూడుకున్న ప్రేమకథ ఇదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ధూపాటి, సంగీతం: అభు. పాటలు: చంద్రబోస్, నిర్మాణం: ఎస్ఎస్ఎంజీ ప్రొడక్షన్స్.