Gaddar | కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar). ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)సంతాప సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.
‘ వారి గళం అజరామరం. ఏ పాట పాడినా.. దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ గద్దరన్న గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం..’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
గద్దర్ మరణం విషాదకరం. తన పాటలు, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా నివాళులర్పిస్తూ.. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని జనసేన పార్టీ అధికారిక ఖాతాలో సంతాప సందేశాన్ని ట్వీట్ చేసింది.
చిరంజీవి సంతాప సందేశం..
వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏
సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023
జనసేన పార్టీ సంతాప సందేశం..
ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు శ్రీ గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం
తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.#Gaddar pic.twitter.com/szkrff3KPO
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2023