సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటిసాయి సురేంద్రబాబు అనే నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘నాలుగు కథలు, నలుగురు దర్శకులు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ప్రతి కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా మా ఈ ప్రయోగం కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. నిరోష, కౌశిక్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వర.