బెంగళూరు : (Naanu Ladies) కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ ఆధారంగా నిర్మించిన సినిమ ‘నాను లేడీస్’ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న 16వ తస్వీర్ సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ప్రముఖ దర్శకురాలు శైలజా పాడిందల నిర్మించిన ఈ సినిమా శాండల్వుడ్ సినీ పరిశ్రమ నుంచి ప్రదర్శిస్తున్న తొలి కన్నడ చిత్రంగా నిలువనున్నది. తస్వీర్ సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అమెరికాలోని సీటెల్లో వచ్చే నెల 1 నుంచి 16 వరకు జరుగనున్నది.
గందరగోళాన్ని తగ్గించి నిజమైన కథలను తీసుకురావడానికి ప్రయత్నించే దర్శకుల్లో ఒకరిగా శైలజా పాడిందల ఉన్నారు. ప్రేక్షకుల సాంప్రదాయ విశ్వాసాలపై పునరాలోచన పడేలా, వారి దృక్పథాలను మార్చడంలో సాయపడేలా సినిమాలను నిర్మిస్తున్నారు. ఈమె దర్శకత్వం వహించి నిర్మించిన షార్ట్ఫిల్మ్ ‘మెమరీ మెషిన్’ ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్కు అనుమతించారు. ఇప్పుడు ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్ ‘నాను లేడీస్’ కూడా ఇక్కడే ప్రదర్శించనున్నారు. ఇలా ఒకే వేదికపై నుంచి రెండు ప్రదర్శించడం థ్రిల్గా ఉన్నదని శైలజ అంటున్నారు. తొలి షార్ట్ఫిల్మ్ను తస్వీర్ వేదికపై స్క్రీనింగ్ చేసిన అనుభవం చాలా గొప్పదని ఆమె తెలిపారు. శైలజ దర్శకత్వంలో వచ్చిన ‘నాను లేడీస్’ సినిమాను తస్వీర్లో ప్రదర్శించడం సంతోషంగా ఉన్నదని ఫిల్మ్ ఫెస్టివల్ వ్యవస్థాపకురాలు రీటా మెహర్ చెప్పారు.
మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లును తెచ్చిన కర్నాటక
శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
జలాలాబాద్లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్లో సివిల్స్కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..