తాడ్వాయి, మార్చి 26: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధిలో భాగంగా గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రానైట్ శిలలను అధికారులు గురువారం తొలగించారు. బుధవారం సాయంత్రం పూజారి కుమారుడు యువన్పై శిల పడి తీవ్రంగా గాయపడడంతో, రాత్రి అధికారులు క్రేన్ తెప్పించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన శిలలను తొలగించారు.