చెన్నై : దక్షిణాది సినీ పరిశ్రమలో పలు భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కే. మురళీధరన్ తమిళనాడులోని కుంభకోణంలో గుండెపోటుతో మరణించారు. మురళీధరన్ గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. వి. స్వామినాధన్, జీ. వేణుగోపాల్తో కలిసి ఆయన లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్పై పలువురు అగ్రనటులతో సినిమాలు రూపొందించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా గోకులంలో సీత మూవీకి మురళీధరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక కమల్ హాసన్, ధనుష్, విజయ్కాంత్, కార్తీక్, విజయ్, సింభు వంటి స్టార్స్తో పలు మూవీలను నిర్మించారు. ఎల్ఎంఎం బ్యానర్పై ఆయన చివరిసారిగా జయం రవి, త్రిష, అంజలి ప్రధాన తారాగణంగా 2015లో సకలకళా వల్లభన్ను ప్రొడ్యూస్ చేశారు.
మురళీధరన్ మరణం పట్ల కమల్హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. మురళీధరన్తో పనిచేసిన రోజులు తనకు గుర్తున్నాయని, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నానని కమల్ ట్వీట్ చేశారు.