ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. అనంతరం థమన్ మాట్లాడుతూ…‘ఒక మొక్క నాటితే ఒక ప్రాణం పోసిన అనుభూతి కలిగింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 16 కోట్లకు పైగా మొకలు నాటడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు ఎంపి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు’ అన్నారు. అనంతరం సంగీత దర్శకులు అనూప్, కళ్యాణి మాలిక్, మికీ జే మేయర్ లకు థమన్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.