Erra Cheera | ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనుమరాలు సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎర్రచీర. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఒక కీలక పాత్రలోనూ ఆయన నటించారు. మదర్ సెంటిమెంట్తో పాటు హారర్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందింది. ఏప్రిల్ 25న అంటే రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఈ విషయాన్ని సినిమా డైరెక్టర్, నిర్మాత సుమన్ బాబు వెల్లడించారు. వేసవి కానుకగా మే రెండో వారంలో ఎర్రచీర సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
సుమన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 25న విడుదల కావాల్సిన ఎర్రచీర సినిమా కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడిందని తెలిపారు. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సినిమాలో కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుందని అన్నారు. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్ధం చేసుకున్నామన్నారు. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారని అన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారని చెప్పారు.
ఈ ప్రెస్మీట్ సందర్భంగా ప్రేక్షకులకు నిర్మాత సుమన్బాబు ఒక కాంటెస్ట్ పెట్టారు. సినిమా రిలీజ్కు ముందే స్టోరీని గెస్ చేస్తే ఐదు లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. స్టోరీని అంచనా వేసిన వారు 80192 46552 ఫోన్ నంబర్కు కాల్ చేసి చెప్పాలని.. విజేతకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు.