Drishyam 2 | ‘పోలీసుల వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి చేసిన పోరాటమేమిటి? తనకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును అతను ఎలా ఎదుర్కొన్నాడు?’ ఈ ప్రశ్నలకు సమాధానంగా ‘ దృశ్యం-2 ’ ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ‘ దృశ్యం ’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ప్రధాన పాత్రల్ని పోషించారు. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన దృశ్యం-2 టీజర్ ఆసక్తికరంగా సాగింది. ‘ఆరేళ్లుగా మన డిపార్ట్మెంట్ను వేధిస్తున్న ప్రశ్నలివి..’ అంటూ పోలీసాఫీసర్ అసహనంగా మాట్లాడటం..‘ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మళ్లీ మమ్మల్ని లాగొద్దు’.. అంటూ కథానాయకుడు వెంకటేష్ ప్రాధేయపడుతున్న సన్నివేశాలతో టీజర్ను ఉత్కంఠను పంచుతున్నది. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్కుమార్ థియేటర్స్, మ్యాక్స్ మూవీస్ పతాకాలపై సురేష్బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్కుమార్ సేతుపతి నిర్మించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Rana Naidu | షూటింగ్ షురూ చేసిన వెంకీ-రానా
58 కేజీల గౌనుతో వెంకీ చిన్న కూతురు.. పిక్స్ వైరల్
రూటు మార్చుకుంటున్న వెంకటేశ్.. అలాంటి సినిమాలకే ఓకే