మలయాళ (Mollywood) స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal), మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దృశ్యం (Drishyam). క్రైం డ్రామా థ్రిల్లర్ గా 2013లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ దృశ్యం 2 (Drishyam 2) కూడా రాగా మంచి విజయం అందుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. హిందీలో అజయ్ దేవ్ గన్, శ్రియ, తమిళంలో కమల్ హాసన్, గౌతమి, తెలుగులో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు.
కాగా ఈ ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది. దృశ్యం సినిమా ఇండోనేషియన్ భాషల్లో కూడా రీమేక్ కాబోతుంది. మేకర్స్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన మలయాళ చిత్రంగా దృశ్యం నిలిచింది. ఫాల్కన్ ప్రొడక్షన్ కంపెనీ దృశ్యం ఇండోనేషియన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.
దృశ్యం సినిమా ఇప్పటికే విదేశీ భాషలైన చైనీస్, సింహలా భాషల్లో తెరకెక్కడం విశేషం. ఈ రెండు భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొత్తానికి విడుదలైన అన్ని భాషల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న దృశ్యం చిత్రానికి మూడో పార్టు రానుంది.
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్